HomeTelugu Trendingపురాతత్వ శాస్ర్తవేత్తగా నాగర్జున.!

పురాతత్వ శాస్ర్తవేత్తగా నాగర్జున.!

8 18బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. బాలీవుడ్‌ జంట ఆలియా భట్‌, రణబీర్‌ కపూర్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, టాలీవుడ్‌ నటుడు నాగార్జున కీలకపాత్రలు పోషిస్తున్నారు. గతకొంతకాలం క్రితం ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాగార్జున పురాతత్వ శాస్ర్తవేత్తగా కనిపించనున్నారు. ఆయన పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉండబోతుందట. ఈ చిత్రంలో ఆయన తన విద్యార్థులతో కలిసి గంగానది ఒడ్డున ఓ పురాతన ఆలయాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తుంటారని తెలుస్తోంది. ఆయన ఎంట్రీ తర్వాత సినిమా చాలా ఆసక్తికరంగా ఉండబోతోందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu