HomeTelugu Big Storiesపాటల చిత్రీకరణలో 'నక్షత్రం'!

పాటల చిత్రీకరణలో ‘నక్షత్రం’!

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”.
‘నక్షత్రం’ టాకీ పార్ట్ పూర్తయింది. నేటి నుంచి ఈ చిత్రానికి సంబంధించి పాటల చిత్రీకరణ ‘బ్యాం కాక్’ లో ప్రారంభమవుతుంది. సందీప్ కిషన్,రెజీనా ల పై ఒక పాట, సాయిధరమ్ తేజ్,ప్రగ్య జైస్వాల్ ల పై ఒక పాట ను చిత్రీకరిస్తారు. అలాగే ఒక ప్రత్యేక గీతాన్ని కూడా చిత్రీకరించ నున్నట్లు దాని వివరాలు బ్యాం కాక్’ నుంచి రాగానే ప్రకటించనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఏప్రిల్ లో చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్య క్రమాలు జరుగుతున్నాయి.
‘పోలీస్ ‘అవ్వాలనే ప్రయత్నం లో వున్న ఓ యువకుడి కథే ఈ ‘నక్షత్రం’. రామాయణం లో హనుమంతుని పాత్ర ఎంతటి ప్రాధాన్యత ను కలిగి ఉంటుందో.. సమాజం లో ‘పోలీస్’ పాత్ర అలాంటిది. అలాంటి పాత్రను ఈ ‘నక్షత్రం’ లో ఎలా చూపించబోతున్నామన్నది వెండితెరపైనే చూడాలన్నారు దర్శకుడు కృష్ణ వంశీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!