HomeTelugu Trendingరేర్ వీడియోను షేర్‌ చేసిన నమ్రత

రేర్ వీడియోను షేర్‌ చేసిన నమ్రత

Namrata shirodkar shared in
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ మాజీ మిస్ ఇండియా అన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్‌లో నమ్రత హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. అనంతరం మహేష్‌ను వివాహం చేసుకుని వెండితెరకు దూరమయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నమ్రత.. భర్త మహేష్‌, పిల్లలకు సంబంధించిన విషయాలతో పాటు అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఆసక్తికర అంశాలపై సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు నమ్రత. 1993 మిస్‌ ఇండియా కార్యక్రమం ఫైనల్‌ రౌండ్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు నమ్రత. ఇందులో నమ్రతతో పాటు పూజా భట్రా కూడా ఉన్నారు. ఫైనల్ రౌండ్‌లో తనకెదురైన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి నమ్రత కిరీటం గెలుచుకున్నారు. వందల ఏళ్ల నుంచి చిక్కు ప్రశ్నగా ఉన్న `కోడి ముందా..? గుడ్డు ముందా..?` అనే ప్రశ్న ఫైనల్ రౌండ్ కంటెస్టెంట్‌లకు ఎదురైంది. ఈ ప్రశ్నకు నమ్రత చెప్పిన సమాధానం `కోడి లేకపోతే గుడ్డు లేదు. కనుక కోడే ముందు`అని చెప్పి మిస్ ఇండియా కిరీటం దక్కించుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu