HomeTelugu Big Storiesనెటిజన్‌కు నవీన్‌ పొలిశెట్టి సర్‌ప్రైజ్‌

నెటిజన్‌కు నవీన్‌ పొలిశెట్టి సర్‌ప్రైజ్‌

Naveen polishetty surprises
టాలీవుడ్‌ యువ నటుడు నవీన్‌ పొలిశెట్టి ఓ నెటిజన్‌ని సర్‌ప్రైజ్‌ చేశారు. ఈమేరకు వీడియో కాల్‌ చేసి నెటిజన్‌ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఇటీవల కరోనా బారినపడి తన తండ్రి కన్నుమూశారని, అప్పటి నుంచి తన తల్లి బాధతో కుంగిపోతోందని మే 5న సాయి స్మరణ్‌ అనే నెటిజన్‌ ఓ ట్వీట్‌ పెట్టాడు. అంతేకాకుండా ‘జాతిరత్నాలు’ వీక్షించిన తర్వాత ఆమె కొంత ఊరట పొందారని పేర్కొంటూ నవీన్‌ పొలిశెట్టిని ట్యాగ్‌ చేశాడు. కాగా, సాయి పెట్టిన ట్వీట్‌ చూసిన నవీన్‌.. ‘మనకెంతో ఇష్టమైన వాళ్లు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీ అమ్మకు ‘జాతిరత్నాలు’ కొంతవరకూ ఊరట కలిగించినందుకు ఆనందిస్తున్నా. మీ వివరాలను నాకు పంపించండి త్వరలోనే సర్‌ప్రైజ్‌ చేస్తా’ అని రిప్లై ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా నవీన్‌.. సాయికి ఫోన్‌ చేశారు. సాయి వాళ్లమ్మతో కొంత సమయంపాటు వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ట్వీట్‌ పెట్టారు. ‘అమ్మ మరలా నవ్వింది. బాధ నుంచి బయటపడడం కోసం ప్రేమ ఎంతో అవసరం. అవసరమైన వారికి చేతనైనంత సాయం చేయండి’ అని ట్వీట్‌ పెట్టారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu