సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో ఎన్నో కీలక పరిణామాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో రియా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డ్రగ్స్ సరఫరా చేశాడనే ఆరోపణలతో రియా సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు సుశాంత్ మాజీ మేనేజర్ శామ్యూల్ మిరిండాను నిన్నఎన్సీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ వీరిద్దరినీ కోర్టులో హాజరుపరచగా నాలుగు రోజుల పాటు ఎన్సీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది. వీరితో పాటు ఇప్పటికే ఈ కేసులో మరో ఏడుగురు అరెస్ట్ అయ్యారు. డ్రగ్ డీలర్ కైజన్కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. సుశాంత్ కేసులో డ్రగ్స్ లింక్స్ ఉండటంతో మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగింది. రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు నిర్ధారణ అయింది. ఈ కేసులో ఎన్సీబీ రియాను విచారించనుంది. ఇప్పటికే రియాకు సమన్లు జారీ చేసింది.