HomeTelugu Trendingటాలీవుడ్‌ స్టార్స్‌కు ఎన్సీబీ సమన్లు?

టాలీవుడ్‌ స్టార్స్‌కు ఎన్సీబీ సమన్లు?

Ncb to send notices to toll
బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్ మృతి తరవాత డ్రగ్స్ కోణం బయటకు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఎన్సీబీ అధికారులు తీగ లాగడంతో అన్నీ ఇండస్ట్రీల డొంకలు కదులుతున్నాయి. ఇప్పటికే ఎన్సీబీ అధికారులు రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు. ఆమెను విచారిస్తున్న సమయంలో బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్లు దీపికాపదుకొనే , సారా అలీ ఖాన్, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు బయటకు రావడంతో వీరిని విచారించింది ఎన్సీబీ. ఈ విచారణలో హీరోయిన్లు తమకు డ్రగ్స్ తో సంబంధం లేదు అని చెప్పినప్పటికీ ఎన్సీబీ అధికారులు వదలకుండా విచారణ చేస్తూనే ఉన్నారు. మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. తాజాగా మరో నలుగురు నటులు పేర్లు బయకు వచ్చినట్టు తెలుస్తుంది. వీరిలో ఒకరిద్దరు తెలుగు నటులు కూడా ఉన్నారని సమాచారం. త్వరలో వీరికి ఎన్సీబీ సమన్లు జరీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీపిక,సారా,శ్రద్ధా,రకుల్‌ విచారణ సందర్భంగా సమాచారాన్ని సేకరించిన ఎన్సీబీ అధికారులు మరికొందరు సినీ నటుల కాల్‌ డేటాను పరిశీలిస్తున్నారు. వారి ఫోన్లపై నిఘా పెట్టారు. త్వరలో ముగ్గురు బాలీవుడ్‌ యాక్టర్లకు కూడా సమన్లు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu