HomeTelugu Trendingఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. తారక్‌ ఎమోషనల్ ట్వీట్

ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. తారక్‌ ఎమోషనల్ ట్వీట్

2 27నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు, సినీ తారలు ఆయనను గుర్తుచేసుకున్నారు. ఆయనతో తమకు ఉన్న తీపి గురుతులను గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి గురవుతున్నారు. ప్రతి ఏడాది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆయన జయంతి నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేవారు. కానీ ఈ ఏడాది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లలేదు. కరోనా కాలం కావడంతో జనాలు గుమ్మిగూడే అవకాశం ఉండటం తో ఆయన ఎన్టీఆర్ ఘాట్ కు రాలేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.`మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను’ . ‘మీరు లేని లోటు తీరనిది..’అంటూ ఎన్టీయార్ ఫొటోను పోస్ట్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం ,తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం ,నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ…” అంటూ ఆయనకు కేక్ తినిపిస్తున్న ఫోటోను షేర్ చేశారు మెగాస్టార్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu