HomeTelugu Trendingతనయులతో ఎన్టీఆర్‌.. ఫొటో వైరల్‌

తనయులతో ఎన్టీఆర్‌.. ఫొటో వైరల్‌

ntr with his sons abhay ram

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ దీపావళి సందర్భంగా .. తన ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. పండగ రోజున తన తనయులు అభయ్‌ రామ్‌, భరత్‌ రామ్‌లతో కలిసి దిగిన ఫొటో తారక్‌ షేర్‌ చేసి ఫ్యాన్స్‌కు డబుల్‌ ట్రీట్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో ముగ్గురు ఒకే రకమైన సంప్రాదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. ఇక తనయులతో తమ అభిమాన హీరోని చూసి ఫ్యాన్స్‌ అంతా తెగ మురిసిపోతున్నారు. దీంతో ఈ ఫొటోను ట్రెండ్‌ చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ అనంతరం ఆయన కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చే ఓ సినిమాతో పాటు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో మరో సినిమాకు సంతకం చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu