Homeతెలుగు Newsప్రజలకు న్యాయం చేస్తానంటే నాయకులకు భయం: పవన్

ప్రజలకు న్యాయం చేస్తానంటే నాయకులకు భయం: పవన్

పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరులో తాను యాత్ర చేస్తుంటే కట్టుబాట్లు విధించడంపై పవన్‌ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జయప్రకాశ్‌ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ కొల్లేరుకు వచ్చినపుడు లేని ఆంక్షలు తాను వచ్చినపుడే మాత్రమే ఎందుకు పెడుతున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. సంప్రదాయ మత్స్యకారులు అవినీతి రాజకీయ పార్టీల కుట్రల మధ్యలో నలిగిపోయారని వ్యాఖ్యానించారు. ప్రజలకు న్యాయం చేస్తానని అంటుంటే ఇక్కడి నాయకులకు భయం పట్టుకుందని పవన్ విమర్శించారు. అందుకే తన వద్దకు రావద్దని, రాకుండా కట్టుబాట్లు విధించారని పవన్ ఆరోపించారు.

9f 1

గత రాత్రి తనపై దాడి చేయడానికి కూడా వచ్చారని పవన్ తెలిపారు. తాను చేతులు కట్టుకుని కూర్చోనని అన్నారు. నామీద దెబ్బ పడేకొద్దీ నేను ఎదుగుతాను తప్ప తగ్గను.. అని పవన్ వ్యాఖ్యానించారు. తాను సీఎం అయితే రూ.110 కోట్లు పెట్టి కొల్లేరులో రెండు రెగ్యులేటర్లు ఏర్పాటు చేస్తానని పవన్‌ హామీ ఇచ్చారు. సీఎం అయిన వెంటనే కొల్లేరు సమస్య పరిష్కరిస్తానని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!