HomeTelugu Newsమూడు రాజధానులపై పవన్‌ కళ్యాణ్‌ సెటైర్లు

మూడు రాజధానులపై పవన్‌ కళ్యాణ్‌ సెటైర్లు

12 10
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేసే ఆలోచన ఉందంటూ అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనపై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్… మూడు రాజధానుల ప్రకటనపై సోషల్ మీడియాలో స్పందించిన జనసేనాని… “తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట.. అలాగ, ఒక్క అమరావతి రాజధానికే దిక్కు దివాణం లేదు ఇప్పటి దాకా.. మరి జగన్ రెడ్డి గారు.. మూడు అమరావతి నగరాలు అమలు అయ్యేనా?” అంటూ ఎద్దేవా చేశారు. ఇక… “పాలకుల వలన, రాష్ట్ర విభజన మొదలుకొని, ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనిశ్చితి, అశాంతి, అభద్రత తప్ప ఇంకేమీ ఒరగలేదు..” అంటూ ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.

‘కమిటీ రిపోర్ట్ రాకమునుపే జగన్‌రెడ్డి గారు మూడు రాజధానులు ప్రకటించే కాడికి, అసలు కమిటీలు వెయ్యడం దేనికి? నిపుణుల్ని అపహాస్యం చేయడం దేనికి?’ అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్… ‘ప్లీనరీలో అమరావతికి ఓకే అన్నందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతారా?.. మాట తప్పను.. మడమ తిప్పను అంటే ఇదేనా?. కేంద్రం అమరావతిని గుర్తించింది. మ్యాప్‌లో మార్పు చేసింది. ఏపీ నూతన రాజధానిగా కేంద్రం నోటిఫై చేయాలంటే మూడు ప్రాంతాల్లో దేన్ని నోటిఫై చేయాలి.’ అంటూ సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్‌ను ప్రశ్నించారు జనసేనాని.

Recent Articles English

Gallery

Recent Articles Telugu