HomeTelugu Trendingఅయోధ్య తీర్పు భారతీయుల విజయం: పవన్‌ కళ్యాణ్‌

అయోధ్య తీర్పు భారతీయుల విజయం: పవన్‌ కళ్యాణ్‌

13 2జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒకరి విజయం.. మరొకరి పరాజయంగా చూడకూడదని అన్నారు. సుప్రీం తీర్పుపై ట్విటర్‌లో ఆయన స్పందించారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది భారతీయుల విజయమని ఆయన అభిప్రాయపడ్డారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును ప్రజలంతా గౌరవించిన తీరే ఇందుకు నిదర్శమన్నారు. ఇది ఒక సామరస్య పూర్వక పరిష్కారమని..శతాబ్ధాల నుంచి అపరిష్కృతంగా ఉన్న వివాదానికి ఒక ముగింపు లభించిందని చెప్పారు. మనిషి పుట్టిన తర్వాతే మతాలు పుట్టాయని, దేశమంటే మట్టి కాదోయ్..దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటలను ఈ సందర్భంగా మననం చేసుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. ముందు మనుషులను గౌరవిద్దామని ఆయన సూచించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu