HomeTelugu Trendingరామ్‌ మరో సంచలన ట్వీట్‌...

రామ్‌ మరో సంచలన ట్వీట్‌…

Hero ram sensational tweets

విజయవాడలోని స్వర్ణ ప్యాలస్ లో రమేశ్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న తర్వాత పలు పరిణామాలు సంభవిస్తున్నాయి. ఈ అంశంపై సినీ హీరో రామ్ పోతినేని కూడా స్పందించాడు. స్వర్ణప్యాలెస్ లో ప్రభుత్వం కూడా క్వారంటైన్ సెంటర్ ను నిర్వహించిందని చెప్పాడు. సీఎం జగన్ కింద పని చేస్తున్న కొందరు ఆయనకు తెలియకుండా చేస్తున్న పనుల వల్ల ఆయన రెప్యూటేషన్ కు డ్యామేజ్ కలుగుతుందని ట్వీట్ చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో రామ్ పై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రామ్ ట్విట్టర్ ద్వారా మరోసారి స్పందించాడు. ‘సోదర సోదరీమణులారా… కులం అనే జబ్బు కరోనా వైరస్ కంటే వేగంగా విస్తరిస్తుంది. అది కరోనా కంటే భయంకరమైనది. సైలెంట్ గా విస్తరించే దీని బారిన పడకండి. ఇందులోకి లాగాలని ఎవరైనా ప్రయత్నించినా… దీని ఉచ్చులోకి పడొద్దు’ అని ట్వీట్ చేశాడు. ఇప్పటికే  విజయవాడ స్వర్ణ ప్యాలెస్ వివాదంపై ట్వీట్స్ చేసిన రామ్ తాజాగా “కులం”పై ట్వీట్ చేసి మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu