Homeతెలుగు Newsదేవుడు ఆజ్ఞాపిస్తే నా పోటీ అక్కడి నుంచే : పవన్‌

దేవుడు ఆజ్ఞాపిస్తే నా పోటీ అక్కడి నుంచే : పవన్‌

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను చాలా మంది పిఠాపురం నుంచి పోటీచేయాలని అడుగుతున్నారని అన్నారు. తనను మత్స్యకారులు అడుగుతుంటే పిఠాపురం ప్రత్యేకత ఏమిటో తనకు అర్థంకాలేదని, ఆ తర్వాత ఇక్కడి ప్రత్యేకత శ్రీపాద వల్లభుడేనని అర్థమైందన్నారు. శ్రీపాద వల్లభుడంటే తనకెంతో ఇష్టం, ప్రేమ, గౌరవమని.. ఆయన ఆశీస్సులు ఉంటే పిఠాపురం నుంచే పోటీచేస్తానేమో అని వ్యాఖ్యానించారు. ఇక్కడి నుంచి పోటీచేయాలని భగవంతుడి ఆజ్ఞే అయితే అప్పుడు చూద్దామన్నారు. ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తనది కాదని, సెలక్షన్‌ కమిటీ అన్ని అంశాలను బేరీజు వేస్తుందన్నారు. తిరుపతి, అనంతపురం, ఇచ్ఛాపురం నుంచి కూడా తనను పోటీచేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో దేన్ని ఎంపిక చేసుకోవాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు.

1 5

జవాబుదారీతనం లేని పరిస్థితుల్లో జనసేన ఆవిర్భవించిందన్నారు. చాలా బలమైన భావజాలంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఉమ్మడి ఏపీలో పాలకులు చేసిన పని వల్ల ప్రజలకు నష్టం జరిగిందని చెప్పారు. ఏపీకి కాంగ్రెస్‌ చేసిన అన్యాయానికి మూడు ఎన్నికల్లో చోటు దక్కలేదని వ్యాఖ్యానించారు. జన సైనికుల్ని కాదని కాంగ్రెస్‌తో కలిసిన సీఎంను చూస్తే చాలా బాధ కలిగిందన్నారు. వంతాడలో రిజర్వ్‌ ఫారెస్టును అడ్డుగోలుగా దోచేస్తున్నారని.. టీడీపీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని పవన్‌ ఆరోపించారు. పేకాట క్లబ్బులు, ఇసుక, మట్టి, ఖనిజ మాఫియా కలిసి దండుకుంటున్నారని చెప్పారు. పంచాయతీకి కూడా పోటీ చేయని వ్యక్తి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. సీఎం, మంత్రి లోకేశ్‌ ఎలా పడితే అలా హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీ, కాంగ్రెస్‌ను వదిలిపెట్టనన్నారు. తాను మోడీ దత్తపుత్రుడిని కాదని, ఆయనంటే తనకు భయంలేదన్నారు. ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుంటే ఎవ్వరైనా తనకు ఒక్కటేనన్నారు. చురకత్తి, కోడికాలికి కట్టే కత్తితో రాజకీయం మారిందని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu