HomeTelugu Big Storiesపవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ఆ పాన్‌ ఇండియా మూవీకి సీక్వెల్‌‌!

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ఆ పాన్‌ ఇండియా మూవీకి సీక్వెల్‌‌!

producer Clarity on Hari Ha
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా- క్రిష్‌ డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా గురించి పవన్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి అప్‌డేట్స్‌ లేకపోవడంతో ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వాటికి చెక్‌ పెట్టాడు నిర్మాత ఏఎమ్‌ రత్నం. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన సినిమాపై అప్‌డేట్ ఇచ్చారు.

‘పవన్‌ కళ్యాణ్‌ తో సినిమా తీసి డబ్బులు సంపాదించుకోవాలంటే 20 రోజులు ఆయన డేట్స్‌ తీసుకొని ఏదోఒకటి తీయెచ్చు. కానీ, ఆయనతో తీసే సినిమా ఎప్పటికీ గుర్తుండిపోవాలి. ఆయనకు మంచి పేరు రావాలి. నేను తీస్తోన్న మొదటి పాన్‌ ఇండియా మూవీ ఇది. ఈ చిత్రం ఆగిపోయిందంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవం లేదు. దాన్ని నమ్మకండి.

‘హరిహర వీరమల్లు’ ఆగిపోలేదు. దీనికి రెండో భాగం కూడా ఉంటుంది. ఈ చిత్రంతో పవన్‌ కళ్యాణ్‌ మరోస్థాయికి వెళ్తారు’ అని చెప్పారు. దీంతో పవన్‌ అభిమానులు సంబరపడుతున్నారు. గతంలోనూ ఓ సందర్భంలో నిర్మాత మాట్లాడుతూ.. ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఇరాన్‌, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో జరుగుతున్నాయన్నారు. ఇది ఫ్యాన్స్‌ ఊహకు మించి ఉండనుందన్నారు.

17వ శతాబ్దం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో పవన్‌ వీరోచిత బందిపోటుగా కనిపించనున్నట్లు టాక్‌. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ కీలక పాత్రలో చేస్తున్నాడు. ఆయన ఔరంగజేబు పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu