HomeTelugu Newsనిఖిల్ నష్టపరిహారం చెల్లించాల్సిందే: నిర్మాత

నిఖిల్ నష్టపరిహారం చెల్లించాల్సిందే: నిర్మాత

4 25యంగ్‌ హీరో నిఖిల్ చేస్తున్న కొత్త చిత్రం ‘ముద్ర’. ఇదే పేరుతో నటుడు జగపతిబాబు ప్రధాన పాత్రలో ఒక సినిమా రూపొందింది. అది నిన్నే విడుదలైంది. టికెట్స్ బుక్ మై షో యాప్ ద్వారా అమ్మకానికి పెట్టారు. ఈ సంగతి తెలియని హీరో నిఖిల్ తన సినిమా పేరును వేరే వాళ్ళు అనుమతులు లేకుండా తీసుకున్నారనుకుని ఆ సినిమా చూడవద్దని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు. దీంతో ఆ చిత్ర నిర్మాత నట్టి కుమార్ ఫిల్మ్ ఛాంబర్ నుండి అన్ని అనుమతులు తీసుకునే సినిమాకు ఆ పేరు పెట్టుకున్నామని, కానీ నిఖిల్ సినిమా చూడొద్దని ప్రేక్షకులకు చెప్పడం వలన నష్టాలు వచ్చాయని అన్నారు. అంతేకాదు ఈ నెల 28 లోపు నిఖిల్ నష్ట పరిహారం చెల్లించాలని లేకుంటే లీగల్ ప్రొసీడింగ్స్ తీసుకుంటామని అంటున్నారు. మరి నిఖిల్ ఈ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu