HomeTelugu Trending'రాధేశ్యామ్‌' కొత్త ట్రైలర్‌

‘రాధేశ్యామ్‌’ కొత్త ట్రైలర్‌

Radhe Shyam Telugu Release Trailer
పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఈ సినిమా కోసం ఆయన ప్రభాస్‌ ఫ్యాన్స్ ఎంతో ఆ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా పరిస్థితులన్నీ అనుకూలించడంతో ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మార్చి 11న రాధేశ్యామ్‌ సినిమాను విడుదల చేయనున్నారు. విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్‌. ఇందులో భాగంగా ఈ రోజు రాధేశ్యామ్‌ కొత్త ట్రైలర్‌ని విడుదల చేసింది.

‘మనం ఆలోచిస్తున్నామని భ్రమపడతాం. మన ఆలోచనలు కూడా ముందే రాసి ఉంటాయి’ అని ప్రభాస్‌ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమవుతోంది. ‘చేయి చూసి ఫ్యూచర్‌ని, వాయిస్‌ విని పాస్ట్‌ని కూడా చెప్పేస్తావా అని ఒకరు ప్రభాస్‌ని అడగ్గా.. ‘విని ఎలా ఎప్పుడు చనిపోతాడో చెప్పనా ‘ అని ప్రభాస్‌ బదులిస్తాడు. ‘ఇంకోసారి చెయ్యి చూడు’ అని జగపతి బాబు అడగ్గా.. నాకు రెండో సారి చెయ్యి చూడడం అలవాటు లేదు అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. అలాగే ట్రైలర్‌ చివర్లో పూజా హెగ్డే చెప్పిన డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది

గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు ఈ సినిమాను సమర్పిస్తుండగా.. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

మేనేజర్​ కూమార్తెల హాఫ్‌ సారీ ఫంక్షన్‌లో రవితేజ

Recent Articles English

Gallery

Recent Articles Telugu