యంగ్ హీరో రాజ్ తరుణ్ గత కొన్ని రోజులుగా వార్తల్లో అస్సలు కనిపించలేదు. ఆయన చేసిన గత నాలుగు సినిమాలు పరాజయం పొందడంతో కొంత బ్రేక్ తీసుకున్న ఆయన నెక్స్ట్ సినిమాతో నిలబడాలని చూస్తున్నాడు. అందుకే సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో రాజ్ తరుణ్ ఒక సినిమా చేస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ‘ఆడు మగాడ్రా బుజ్జి’ ఫేమ్ కృష్ణారెడ్డి డైరెక్ట్ చేస్తాడట. త్వరలోనే ఈ విషయం అధికారికంగా ప్రకటించనున్నారు. ఇకపోతే వరుసగా కొన్ని ఫైల్యూర్స్ చుసిన దిల్ రాజు ‘ఎఫ్ 2’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు.