దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ను బుధవారం విడుదల చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించారు. ‘నా మొత్తం చిత్ర బృందం తరఫున అభిమానులు, ప్రేక్షకుల్ని నేను కోరుతున్నా.. ఇంట్లోనే ఎంజాయ్ చేయండి. అందరం కలిసేందుకు కారణం లేదు కాబట్టే.. ఈ దేశమంతా లాక్డౌన్లో ఉంది. ప్రపంచం సంక్షోభం ఎదుర్కొంటోన్న తరుణం ఇది. ఈ సమయంలో ప్రతి ఒక్కరి స్ఫూర్తిని మేలుకొలిపేందుకు మా వంతు ప్రయత్నం చేయాలి అనుకున్నాం. బుధవారం ‘ఆర్.ఆర్.ఆర్’ టైటిల్ మోషన్ పోస్టర్ను విడుదల చేయబోతున్నాం. రీలీజ్ టైం ఇది అని నేను చెప్పలేను. ఎందుకంటే.. మా బృందం వాళ్ల వాళ్ల ఇంటి నుంచి పనిచేస్తున్నారు. మీ నివాసాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్లో ఉండండి.. థ్రిలింగ్ అవ్వండి. పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని కోరుతున్నా’ అని జక్కన్న ట్వీట్లు చేశారు. దీంతోపాటు ఓ ప్రత్యేక పోస్టర్ను పంచుకున్నారు. అందులో నిప్పు, నీరు ఉన్న చేతుల్ని చూపించారు.
‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. దానయ్య నిర్మాత. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.