HomeTelugu Big Storiesమోడీకి చిరు, రామ్‌ చరణ్‌ మద్దతు

మోడీకి చిరు, రామ్‌ చరణ్‌ మద్దతు

12 2

కరోనా విజృంభిస్తున్న నేపద్యంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ సమయంలో ప్రధాని మోడీ ఏప్రిల్‌ 5 వ తేది ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు మన ఇళ్లలోని లైట్స్ ఆపేసి దీపాలు వెలిగిద్దాం అంటూ పిలుపునిచ్చారు. మొదట్నుంచి కూడా మెగా ఫ్యామిలీ ఈ వైరస్‌పై తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. సెలబ్రిటీలు ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని అందరికీ పిలుపునిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి, రామ్ చరణ్ కూడా ఇదే చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రజలకు మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ పిలుపును వినిపించారు తండ్రీకొడుకులు.

ఆయనకు మద్దతుగా నిలవాలని మోడీ చెప్పినట్లు చేద్దామని అంటున్నారు. ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు మన ఇళ్లలోని లైట్స్ అన్నీ ఆపేసి దీపాలు వెలిగిద్దాం. ప్రధాని మోడీగారి మాటను పాటిద్దాం. ఎవ్వరూ మరిచిపోవద్దు.. కరోనా లేని ఇండియాను సాదిద్ధాం అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.

ఇక చిరంజీవి కూడా కరోనాను ఎదుర్కొనే విషయంలో భారతీయులంతా ఒక్కటే అని నిరూపిద్దాం.. ప్రధాని మోడీ చెప్పినట్లు ఆదివారం 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్ ఆర్పేసి.. ఇంటి బయటికు వచ్చి సెల్ ఫోన్ ఫ్లాష్ కానీ, కొవ్వొత్తులుగాని వెలిగిద్దామని చెప్పాడు మెగాస్టార్‌. వాళ్లతో పాటు మిగిలిన సెలబ్రిటీస్ కూడా ప్రధాని చెప్పినట్లు చేద్దామంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu