HomeTelugu Trendingరాజకీయ సినిమా ప్రకటించిన ఆర్జీవీ

రాజకీయ సినిమా ప్రకటించిన ఆర్జీవీ

Ram gopal varma political m
డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ప్రకటించారు. అతి త్వరలో రెండు పార్టులతో రాజకీయ సినిమాని రూపొందిస్తున్నట్టు తెలిపారు. మొదటి పార్టు టైటిల్ ‘వ్యూహం’ అని, రెండో పార్టు టైటిల్ ‘శపథం’ అని తెలిపారు. ఈ రెండు భాగాల్లోనూ రాజకీయ అరాచకీయాలు పుష్కలంగా ఉంటాయని తనదైన శైలిలో ట్వీట్ చేశారు.. ఇది బయోపిక్ కాదని, బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్ అని పేర్కొన్నారు.

బయోపిక్ లో అయినా అబద్ధాలు ఉంటాయేమో కానీ, రియల్ పిక్ లో నూటికి నూరుపాళ్లు నిజాలే ఉంటాయని వెల్లడించారు. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించినదే ‘వ్యూహం’ కథ అని రామ్ గోపాల్ వర్మ వివరించారు. ఇది రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందని, రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహాన్ని ప్రతిబింబించేలా ‘వ్యూహం’ చిత్రం ఉంటుందని తెలిపారు.

రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం ‘వ్యూహం’ షాక్ నుంచి తేరుకునేలోపే… పార్ట్-2 ‘శపథం’లో మరో ఎలక్ట్రిక్ షాక్ తగులుతుందని పేర్కొన్నారు. కాగా, తనతో ‘వంగవీటి’ చిత్రాన్ని నిర్మించిన దాసరి కిరణ్ ఈ పొలిటికల్ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తారని వర్మ వెల్లడించారు. వర్మ నిన్న ఏపీ సీఎం జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. జగన్ తో లంచ్ సమావేశం జరిపిన వర్మ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu