రిషబ్ శెట్టి హీరోగా నటించిన చిత్రం ‘కాంతారా’. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదట కన్నడలో భారీ హిట్ అయ్యి ఇప్పుడు తెలుగు సహా ఇతర భాషల్లో కూడా సత్తా చాటుతుంది. ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు చేస్తున్నారు.
తాజాగా వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఈ సినిమాపై స్పందించాడు. థియేటర్స్ కి జనాన్ని పెద్ద బడ్జెట్ ఉన్న చిత్రాలే తీసుకువస్తాయి అనే నానుడి ని రిషబ్ శెట్టి బద్దలు కొట్టాడు. కొన్ని దశాబ్దాలు పాటు ‘కాంతారా’ విజయం ఒక పాఠంగా నిలిచిపోతుంది అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
The @Shetty_Rishab destroys the myth in film people that only mega budget films will pull people into theatres .. #Kantara will be a major lesson for decades to come
— Ram Gopal Varma (@RGVzoomin) October 18, 2022