డైరెక్టర్ అనిల్ రావిపూడి గతంలో యంగ్ హీరోరామ్తో ఓ చిత్రం తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ, పలు కారణాల వల్ల రామ్ అప్పుడు ఆ సినిమా చేయలేకపోయారు. దాంతో ఆ కథను రవితేజకు వినిపించి అనిల్ ‘రాజా ది గ్రేట్’ తెరకెక్కించారు. తాజాగా అనిల్.. రామ్ కోసం ఓ ప్రాజెక్ట్ను సిద్ధం చేస్తున్నారని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ‘సరిలేరు నీకెవ్వరు’ తెరకెక్కిస్తున్న అనిల్ తన తదుపరి చిత్రం రామ్తో చేయనున్నారంటూ ఇప్పటికే టాలీవుడ్లో ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయని, అనిల్ చెప్పిన కథ నచ్చడంతో రామ్ ఓకే చెప్పే అవకాశాలున్నాయని చిత్రసీమలో వినికిడి. ప్రస్తుతం రామ్.. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రెడ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే అనిల్తో సినిమా చేస్తాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.