బిగ్బాస్-4 మొదటి వారం పూర్తిచేసుకుంది. తొలి ఎలిమినేషన్ పూర్తైంది. సూర్యకిరణ్ ఎలిమినేట్ అయిన మొదటి సభ్యులు. తాజాగా ప్రోమోలో బిగ్బాస్ హౌస్లో రెండో వారం నామినేషన్ ప్రక్రియ మొదలయ్యింది. ఇప్పటికే కంటెస్టెంట్లలో ఒకరికొకరికి మధ్య సరైన అవగాహన లేదన్న విషయం కొట్టొచ్చినట్లు కన్పిస్తుండగా..బిగ్బాస్ మరోసారి వారి మధ్య చిచ్చు పెట్టేందుకు రెడీ అవుతున్నారు.
సోమవారం ఇంటి సభ్యులకు ఓ టాస్క్ను ఇచ్చాడు బిగ్బాస్. ఇంటిలోపల ఓ పడవను ఏర్పాటు చేసి అందులోకి అందరిని కూర్చోమన్నాడు. సభ్యులందరూ పడవ ఎక్కిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దిగేందుకు వీల్లేదని తెలిపాడు. పడవ తీరం చేరుకున్నాక హారన్ కొట్టిన వెంటనే ఓ ప్యాసింజర్ ఖచ్చితంగా దిగాలని నిబంధన పెట్టాడు. అలా ఎవరైతే పడవ నుంచి దిగుతారో ఆ సభ్యుడు ఈ వారం నామినేషన్ అవుతారని పేర్కొన్నాడు. దీంతో ఇంటి సభ్యుల్లో ఎవరిని పడవ నుంచి దింపేయలాన్న సందేహం మొదలైంది. అయితే ముందు నేనే దిగి వెళ్లి పోతానంటూ గంగవ్వ సిద్ధపడంది. దీంతో గంగవ్వను ఆపేందుకు మిగిలిన వారందరరూ ప్రయత్నినట్లు కన్పిస్తోంది. నోయల్ కల్పించుకొని.. అందరితో మంచి రిలేషన్ ఉన్నందున ఆ బంధం తెగిపోవద్దని అలా దిగిపోతానంటుదని అంటున్నాడు.
మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా సాయి కూమార్ అనే నటుడు హౌస్లోకి ప్రవేశించాడు. అర్థరాత్రి ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి ఇంటి సభ్యులందరికి సర్ప్రైజ్ ఇవ్వాలనున్నాడు. అయితే ఈ ప్లాన్ బెడిసి కొట్టి దొంగ అనుకొని ఇంటి సభ్యులు తనను కొట్టే అవకాశం ఉందని భయతో కుమార్ సాయి బిగ్బాస్తో విన్నపించుకున్నాడు. మరి సాయి కుమార్ ఇంట్లో వాళ్లతో ఎలా కలవనున్నాడు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేషన్లో ఉంటారో చూడాలి.
Boat journey simple ga undabothunda..enthamandi untaru? enthamandi digutharu? Lets wait and watch!!#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/Er1OPgUAx6
— starmaa (@StarMaa) September 14, 2020