మాస్మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చాడు. దివ్యాన్ష కౌశిక్ .. రజీషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. రజీషా విజయన్ ఈ సినిమాతోనే తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నెల 16న ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. 1995లో జరిగిన యథార్థ సంఘటనల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు.
చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాతో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇతర ముఖ్యమైన పాత్రలలో నరేశ్, పవిత్ర లోకేశ్, తనికెళ్ల భరణి నటించారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.