HomeTelugu Newsకరోనా క్రైసిస్ ఛారిటీకి రామోజీరావు విరాళం

కరోనా క్రైసిస్ ఛారిటీకి రామోజీరావు విరాళం

15 7

తెలుగు సినీ కార్మికుల కోసం చిరంజీవి మరికొందరు సినీ పెద్దలు కలిసి ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి భారీగా విరాళాలు వస్తున్నాయి. వీరు చేస్తున్న సేవలు చూసి పలువురు స్పందిస్తున్నారు. ఈ ఛారిటీకి మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షుడు కాగా, సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, సి. కల్యాణ్, దాము, శంకర్, బెనర్జీ, మెహర్ రమేష్ సభ్యులుగా ఉన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే సినీ పరిశ్రమలోని కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సినీ పరిశ్రమలోనూ దినసరి కూలీలు ఉంటారు. షూటింగులు లేకపోతే అలాంటి వారు పస్తులుండాల్సిన పరిస్థితి. అలాంటి వారిని ఆదుకోవడమే లక్ష్యంగా ఈ ఛారిటీని ఏర్పాటు చేశారు. ఈ ఛారిటీకి ప్రముఖ రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు రూ. 10 లక్షలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి ట్విట్టర్ వేదికగా రామోజీరావుకు ధన్యవాదాలు తెలిపారు. సినీ కార్మికుల కోసం ఏర్పాటుచేసిన ఛారిటీకి సహృదయంతో మీవంతు సహాయం చేసినందుకు ధన్యవాదాలు సర్ అంటూ ట్వీట్ చేశారు. చిత్ర పరిశ్రమకు మీరు చేస్తున్న సేవలు అసాధారణమైనవి. మీరు లెజెండ్ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!