HomeTelugu Trendingబాలీవుడ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు

4 16

సీనియర్‌ నటి రమ్యకృష్ణ బాలీవుడ్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ ఆత్మహత్యతో బాలీవుడ్ ఇండస్ట్రీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో రమ్యకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రమ్యకృష్ణ తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగింది. అటు తమిళంలో కూడా ఆమె హవా అప్పట్లో నడిచింది.

దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ ప్రముఖ నటిగా రమ్యకృష్ణ గుర్తింపు సంపాదించుకుంది. హిందీలో ‘దయావాన్’, ‘పరంపర,‘ఖల్ నాయక్’, ‘చాహత్’, ‘బడేమియా చోటేమియా’ వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారామె. అయితే తరువాత హిందీ సినిమాల్లో ఎందుకు నటించలేదన్న దానిపై రమ్యకృష్ణ స్పందిస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నిజానికి నా సినిమాలు ఉత్తరాదిలో సరిగ్గా ఆడలేదు. అక్కడ నాకు వచ్చిన ఆఫర్లు కూడా ఆసక్తికరంగా లేవు. అందుకే ఇన్నేళ్లు నటించలేదు అన్నారు. ఇక నెపోటిజం అనేది అన్ని ఇండస్ట్రీల్లోను ఉంది. అయితే బాలీవుడ్‌లో కాస్త ఎక్కువగానే ఉందంటూ అని రమ్యకృష్ణ అంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu