సినిమా వాళ్ళు చాలా మంది తాము టాప్ పొజిషన్ కు వెళ్ళిన తరువాత తమకు కెరీర్ లో బ్రేక్ ఇచ్చిన వారిని గుర్తు పెట్టుకోరని, వారికంత ప్రాధాన్యత ఇవ్వరనే మాటలు వినిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు ఆ మాటలను తుడిపేస్తూ హీరోయిన్ రాశి ఖన్నా తీసుకున్న నిర్ణయం అందరినీ ఆకట్టుకుంటోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో గతంలో ‘సుప్రీం’ సినిమాలో నటించింది రాశిఖన్నా. రాశి కెరీర్ కు ఆ సినిమా ప్లస్ అయిందనే చెప్పాలి. ఆ కృతజ్ఞతతో ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఓ సినిమాలో ఉచితంగా ఐటెమ్ సాంగ్ లో నటించిందట రాశి.
నిజానికి రాశిఖన్నా ఇదివరకు ఐటెమ్ సాంగ్స్ లో నటించింది లేదు. కానీ మొదటిసారిగా అనిల్ రావిపూడి కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా వెనుకాడలేదట. ఈ పాట కోసం ఆమె ఒక్క రూపాయి కూడా చార్జ్ చేయకపోవడం విశేషం. ప్రస్తుతం రాశిఖన్నా, రవితేజ సరసన ‘టచ్ చేసి చూడు’ అనే సినిమాలో నటిస్తోంది.