టాలీవుడ్ లోకి ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న తన రెండో సినిమా గీత గోవిందం సినిమాతో టాప్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఈ సినిమా సమయంలో రష్మిక, విజయ్ దేవరకొండల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ కుదిరింది. అయితే, ఈ సినిమా తరువాత ఇద్దరు కలిసి డియర్ కామ్రేడ్ చేస్తున్నారు.
ఈ సినిమాతో ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే వెళ్తుండటంతో ఈ అనుమానాలు నిజమేనా అని అనిపిస్తున్నది. నిజమో కాదో తెలియాలంటే ఇంకాస్త సమయం పడుతుంది.