HomeTelugu Trendingరష్మిక ఇకపై ఆ హీరోతోనే నటిస్తుందట!

రష్మిక ఇకపై ఆ హీరోతోనే నటిస్తుందట!

7 29
టాలీవుడ్ లో ‘చలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన వరుస విజయాలతో ఇప్పడు బిజీగా మారిపోయింది. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించి హిట్ అందుకుంది ఈ బ్యూటీ. ఈ సినిమాతో కుర్రకారుని ఆకట్టుకున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన నటిస్తుంది. సుకుమార్ బన్నీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో రష్మికను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇదే అదునుగా భావించిన అమ్మడు పారితోషికాన్ని భారీగా పెంచేసిందట. వరుస విజయాలు రావడంతో లక్కీ గర్ల్ గా మారి నిర్మాతలకి సెంటిమెంట్ గానూ మారింది ఈ భామ. అంతే కాదు చిన్న హీరోల సినిమాల్లో నటించడానికి ఇష్టపడటం లేదని టాక్. మీడీయం రేంజ్ ఉన్న హీరోలతో చేసే కథల్ని తన వద్దకు తీసుకురావద్దంటూ చెప్పిందట. దీంతో ఆమె స్టార్ హీరోలతో మాత్రమే చేస్తుందని ఫిలిమ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu