టాలీవుడ్లో వరుస అవకాశలతో దూసుకుపోతున్నరష్మిక మెగా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు జంటగా నటించే అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఆయన ఇందులో విద్యార్థి నాయకుడుగా కనిపిస్తాడని అంటున్నారు. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ కూడా వుంటుందట. దాంతో తాజాగా ఆ పాత్రకు రష్మికను సంప్రదించారట. పాత్ర నచ్చడంతో ఆమె కూడా ఒప్పుకున్నట్లు తాజా సమాచారం. వచ్చే ఏడాది ఆమె ఈ చిత్రం షూటింగులో జాయిన్ అవుతుందని అంటున్నారు. ‘ఆచార్య’ షూటింగు విషయానికి వస్తే, గత కొన్నాళ్లుగా ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. చిరంజీవి కూడా నిన్నటి నుంచి షూట్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయనపై యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.