టాలీవుడ్ హీరో మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ నెల 29న (శుక్రవారం) ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే రిలీజ్ కు ఒక్క రోజు ముందుగా సినిమాలోని ఓ బిట్… సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. 22 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో లీక్ కావడంతో చిత్ర యూనిట్ ఆందోళనలో పడిపోయింది. ప్రస్తుతం ఆ బిట్ సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.
సినిమాలో ఓ పవర్ ఫుల్ సీన్కు చెందినదిగా ఆ బిట్ కనిపిస్తోంది. విలన్లకు రవితేజ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఆ బిట్లో కనిపించారు. ఈ వీడియో బిట్ బయటకు వచ్చినంతనే లీకేజీని పసిగట్టిన చిత్ర యూనిట్ ఘటనపై ఆరా మొదలెట్టింది. ఎడిటింగ్ రూం నుంచే ఈ బిట్ లీకై ఉంటుందని భావిస్తోంది.