సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ రేపు (డిసెంబర్25)న విడుదల కానుంది. కాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు పూజా కార్యక్రమాలు కూడా చేశారు. ఈ సినిమా ఓ మిస్టికల్ థ్రిల్లర్గా రూపొందనుంది. ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. కార్తీక్ వర్మ భమ్ బోలేనాథ్ సినిమాతో పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించనున్నారు. ఈ సినిమా శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ జెండాపై సుకుమార్లు కలిసి నిర్మించనున్నారు. ఈ సినిమాను లాంఛనంగా హైదరాబాద్ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు. ఈ సినిమాలోని నటీనటులను ఇంకా ఎంపికచేయలేదు. మరి ఈ ప్రయేగం ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి