HomeTelugu Trendingనొప్పిగా ఉందన్న సాయిధరమ్‌తేజ్‌

నొప్పిగా ఉందన్న సాయిధరమ్‌తేజ్‌

Sai dharam tej speak family
హీరో సాయిధరమ్‌తేజ్‌ స్పృహ వచ్చినట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తను మాట్లేందుకు కూడా తీవ్రంగా ఇబ్బందిపడినట్లు సమాచారం. కేవలం ఒక నిమిషమే మాట్లాడినప్పటికీ ఆ సమయంలో చాలా నొప్పిగా ఉందని తేజ్‌ వైద్యులకు చెప్పారట. దీంతో తను మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో వీడియో కాల్‌ ద్వారా కుటుంబ సభ్యులను చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న తేజ్‌ దగ్గరకు ఆయన కుటుంబ సభ్యులను కూడా అనుమతించడం లేదు అపోలో వైద్యులు.

కేవలం వీడియో కాల్ ద్వారానే అందరూ పరమర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా సాయి తేజ్ వైద్యానికి స్పృహలోకి వచ్చాడనే కథనాలు వస్తుండటంతో ఆయన త్వరగా ఇంటికి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu