HomeTelugu Trendingరానాకు ఛాలెంజ్ విసిరిన సాయి పల్లవి..!

రానాకు ఛాలెంజ్ విసిరిన సాయి పల్లవి..!

6 11
పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో సినీ, రాజకీయ ప్రముఖులు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సమంత అక్కినేనితో పాటు రానా దగ్గుబాటిని నామినేట్‌ చేసింది కథానాయిక సాయి పల్లవి. అనంతరం వారు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కు కొనసాగింపుగా మరికొందరికి సవాళ్లను విసురుతున్న విషయం తెలిసిందే. సినీ నటుడు అక్కినేని అఖిల్‌ విసిరిన ఛాలెంజ్‌ను వరుణ్‌తేజ్‌ స్వీకరించి తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. తర్వాత సాయిపల్లవి, తమన్నాను నామినేట్‌ చేశారు వరుణ్‌. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన సాయి పల్లవి మొక్కను నాటి తర్వాత రానాను నామినేట్ చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని సాయిపల్లవి తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu