HomeTelugu Trendingమరోసారి జత కట్టనున్న ధనుష్‌-సాయి పల్లవి!

మరోసారి జత కట్టనున్న ధనుష్‌-సాయి పల్లవి!

Sai pallavi opposite dhanus
కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌, డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల కాంబినేషన్‌లో ఓ త్రిభాష చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఎస్వీసీఎల్ఎల్‌పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు… ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. తెలుగు, తమిళం, హిందీ భాష‌ల‌లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని తెలిపారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వహిస్తుండటం, ధనుష్‌ నటిస్తున్న తొలి తెలుగు సినిమా కావడంతో.. ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర వార్త ఒకటి వైరలవుతుంది. ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా హీరోయిన్‌ సాయిపల్లవి నటించనుందని సమాచారం. ఇప్పటికే మేకర్స్‌ ఆమెతో చర్చలు జరిపారని, సాయిపల్లవి కూడా పాజిటివ్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. ఇప్పటికే సాయిపల్లవి ధనుష్‌తో కలిసి ‘మారి 2’ తమిళ చిత్రంలో జతకట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌ రిపీట్‌ కానుందట. ప్రస్తుతం సాయిపల్లవి శేఖర్‌ కమ్మలు డైరెక్షన్‌లో లవ్‌స్టోరీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu