HomeTelugu Big Stories12 ఏళ్లు 'ఏమాయ చేశావే' పూర్తి.. సమంత పోస్ట్‌ వైరల్‌

12 ఏళ్లు ‘ఏమాయ చేశావే’ పూర్తి.. సమంత పోస్ట్‌ వైరల్‌

Samantha emotional post gos
సమంత టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి12 ఏళ్లు పూర్తి కావొస్తుంది. గౌతమ్‌మీనన్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఏమాయ చేశావే’ సినిమాతో సమంత ఎంట్రీ చేసింది. ఈ చిత్రం విడుదలైన నేటికి 12ఏళ్లు. ఈ సందర్భంగా తన సినీ జర్నీని తెలియజేస్తూ సామ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ను షేర్‌ చేసుకుంది. ‘చిత్ర పరిశ్రమలో నటిగా నా ప్రయాణం మొదలై నేటికి 12 సంవత్సరాలు.

లైట్స్‌, కెమెరా, యాక్షన్‌.. వీటి చుట్టూ నాకున్న మధుర ఙ్ఞాపకాలు, అద్భుతమైన అనుభూతులకు 12 ఏళ్లు. ఇన్నేళ్ల ప్రయాణంలో ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్థమైన అభిమానులను పొందినందుకు ఆనందంగా ఉంది. సినిమాపై నాకున్న ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా’ అంటూ సమంత పేర్కొంది. కాగా ఈ సినిమాతోనే సమంత-నాగ చైతన్య తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు.

అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో 2021, అక్టోబర్‌ 2న విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన తొలి సినిమా గురించి సమంత పోస్ట్‌ చేయడం ఆసక్తిగా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu