HomeTelugu Big Stories'సామ్‌జామ్‌'లో కళ్లకు గంతలు కట్టుకుని దోశ వేసిన చిరంజీవి

‘సామ్‌జామ్‌’లో కళ్లకు గంతలు కట్టుకుని దోశ వేసిన చిరంజీవి

Samjam mega promo

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ‘ఆహా’లో నిర్వహిస్తున్న ‘సామ్‌జామ్’ షోలో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల పాల్గొన్న విషయం తెలిసిందే. క్రిస్మస్‌కు ఈ షో ప్రసారం కానుంది. ఈ షోకు సంబంధించిన మరో ప్రోమోను విడుదల చేశారు. ఇందులో చిరు చాలా ఫన్నీగా సమాధానాలు చెప్పారు. ఎప్పుడైనా సినిమా చూస్తూ ఏడ్చారా? అని ఆయనను సమంత ప్రశ్నించింది. దీనికి జవాబు చెబుతూ, తాను గతంలో ఓ సినిమాకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నానని, కిందకు వంగి కన్నీరు తుడుచుకుంటున్న సమయంలో లైట్స్‌ వేశారని, ఆ సమయంలో తాను పైకి లేచేసరికి ఓ పైట తన చేతిలో ఉందని.. అంటూ ఇంకా ఏదో నవ్వుతూ చెప్పారు. గతంలో చిరంజీవి దోశ ఛాలెంజ్‌ లో పాల్గొన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన ఫేవరేట్ దోశ ఛాలెంజ్ లో మరోసారి పాల్గొనాలని సమంత కోరింది.

దీంతో షోలో ఆయన కళ్లకు గంతలు కట్టుకుని దోశ ఛాలెంజ్‌ను చేసి చూపించారు. కాగా, చిరుకి వైవా హర్ష ఓ ప్రశ్న వేశాడు. ఒకవేళ మీ సినిమాలను రీమేక్ చేయాలంటే మీ పాత్రలను ఎవరు చేయగలరని ఆయన ప్రశ్నించాడు. చరణ్, తారక్, బన్నీ, రవితేజ, ప్రభాస్, విజయ్ దేవరకొండ, మహేష్, పవన్ కళ్యాణ్ అని చిరంజీవి అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu