HomeTelugu Trendingప్రముఖ టీవీ నటి ఆత్మహత్య

ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య

1 22
హిందీలో ప్రసారమయ్యే ప్రముఖ టీవీ సీరియల్‌ ‘దిల్‌ తో హ్యాపీ హై జీ’లో నటించి సిమ్మి ఖోస్లాగా గుర్తింపు తెచ్చుకున్న నటి సెజల్‌ శర్మ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. థానే జిల్లాలోని తన నివాసంలో ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు ఘటనాస్థలిలో సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్‌ నోట్‌లో సెజల్ పేర్కొందని పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనపై ఆమె సహనటుడు, స్నేహితుడు నిర్భయ్‌ శుక్లా స్పందించారు. ‘తండ్రి ఆరోగ్యం విషయంలో సెజల్‌ మానసికంగా ఒత్తిడికి గురైంది. నవంబర్‌ 15న కలుద్దామని తనకి మెస్సేజ్‌ చేశాను. గుండెనొప్పి రావడంతో తన తండ్రిని ఉదయ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రిలో జాయిన్‌ చేశామని.. అక్కడికి వెళ్తున్నానని సెజల్‌ రిప్లై ఇచ్చింది. ఆమె తండ్రి క్యాన్సర్‌ బాధితుడు. దీంతో ఆయన ఆరోగ్యంపై చాలా బాధపడేది.

ఆ తరుణంలోనే ఆయనకు గుండెనొప్పి రావడంతో బాగా కుంగిపోయింది. నేను ఎప్పుడైనా ఆయన ఆరోగ్యం గురించి మెస్సేజ్‌ చేస్తే.. కోలుకుంటున్నారు, కానీ ఇక్కడ అంత మంచిగా లేదు.. అని రిప్లై ఇస్తుండేది. జనవరి నెల చివర్లో మేము కలుసుకోవాలనుకున్నాం. ఇంతలోనే ఇలా జరిగింది’ అని నిర్భయ్‌ పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu