సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ మరోసారి తల్లయ్యారు. సౌందర్య-విషగన్ దంపతులు నిన్న మగబిడ్డకు జన్మనిచ్చారు. చిన్నారికి వీర్ రజనీకాంత్ వనంగమూడి అని నామకరణం చేశారు. సౌందర్య రజినీకాంత్ స్వయంగా తాను మరోమారు తల్లి అయ్యాను అంటూ చాలా సంతోషంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. కొడుకు జన్మించినట్లుగా సౌందర్య సోషల్ మీడియా లో తెలియజేయడంతో రజినీకాంత్ అభిమానులు పెద్ద ఎత్తున ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
‘దేవుని దయ, తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో వేద్కృష్ణ తమ్ముడు వీర్ రజనీకాంత్ వనంగమూడికి విషగన్, వేద్, నేను స్వాగతం పలుకుతున్నాం. డాక్టర్ సుమన మనోహర్, డాక్టర్ శ్రీవిద్య శేషాద్రికి ధన్యవాదాలు’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ మేరకు ఫొటోలను షేర్ చేశారు.
సౌందర్యకు గతంలో వ్యాపారవేత్త అశ్విన్ కుమార్తో వివాహమైంది. వీరికి వేద్కృష్ణ జన్మించాడు. అయితే, ఆ తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం 2019లో వ్యాపారవేత్త విషగన్ వనంగమూడిని సౌందర్య పెళ్లాడారు. తాజాగా, నిన్న వీరికి బాబు జన్మించాడు.