HomeTelugu Newsచిరంజీవి, నాగార్జున కుటుంబాలపై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి..

చిరంజీవి, నాగార్జున కుటుంబాలపై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి..

11 13బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అన్నింటికి మించి స్టార్ హీరోగా ఎదుగుతున్న టైమ్‌లో ఆయన్ని కొందరు కావాలనే మానసిక ఒత్తిడికి గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు అంటూ.. ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే సుశాంత్ మరణం తర్వాత ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ప్రతీ ఒక్కరూ స్పందిస్తున్నారు.

సుశాంత్‌ మరణం పక్కా ప్లానింగ్‌తో చేసిన మర్డర్ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ‘నెపోటిజం’ అనే అంశంపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్‌, వివేక్ ఒబేరాయ్, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లు కూడా ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజంపై స్పందించారు. తాజాగా ఈ అంశంపై వివాదస్పద నటి శ్రీ రెడ్డి కూడా తనదైన స్టైల్‌లో స్పందించింది.

గట్స్ లేని మూవీ లెజండ్స్ మాత్రమే న్యూ టాలెంట్‌ని చంపేస్తున్నారు.. సిగ్గు పడండి.. వాళ్లే చిరంజీవి, నాగార్జున, బాలీవుడ్ ఖాన్స్ అండ్ కపూర్ ఫ్యామిలీస్ అంటూ కమెంట్ పెట్టింది. దాంతో పాటు తన శైలిలో బూతులు కూడా వాడేసింది ఈ బ్యూటీ. తెలుగు ఇండస్ట్రీలో నెపోటిజంపై కామెంట్ చేయడమే కాకుండా చిరంజీవి, నాగార్జున కుటుంబాలపై కూడా విరుచుకుపడింది. ఇక్కడ కూడా బంధుప్రీతి ఎక్కువైపోతుందని.. వారసులు తప్ప బయటి వాళ్లు రావట్లేదని.. రానివ్వట్లేదని చెప్పింది శ్రీ రెడ్డి. ఈమె చేసిన వివాదాస్పద కామెంట్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి నాగార్జునపై శ్రీ రెడ్డి పోస్ట్ (Sri Reddy post)

Recent Articles English

Gallery

Recent Articles Telugu