HomeTelugu Trendingమరో భారీ ప్రాజెక్టు అనౌన్స్ చేసిన రాజమౌళి

మరో భారీ ప్రాజెక్టు అనౌన్స్ చేసిన రాజమౌళి

Rajamouli made in india
బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలలో చాటిచెప్పిన టాలీవుడ్‌ దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. తాజాగా మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. భారతీయ సినిమా రంగంపై వస్తున్న బయోపిక్‌ను ఆయన సమర్పించనున్నారు. ఇండియన్‌ సినిమా ఎక్కడ పుట్టింది, దానికి మూలం ఏమిటి అనే కథతో ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

మేడ్ ఇన్ ఇండియా సినిమాకు నితిన్‌ కక్కర్‌ దర్శకత్వం వహించబోతున్నారు. ఎస్‌ఎస్‌ కార్తికేయ, వరుణ్‌ గుప్తా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మకమైన చిత్రం రాజమౌళి సమర్పణలో తెరకెక్కబోతోంది.

ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. ఓ వీడియోను సైతం విడుదల చేశారు. ‘మొదట ఈ కథ విన్నప్పుడు నేను చాలా భావోద్వేగానికి గురయ్యా. బయోపిక్‌లను రూపొందించడం చాలా కష్టం. అలాంటిది భారతీయ సినిమాపై బయోపిక్‌ అంటే సవాళ్లతో కూడుకున్న పని. ఇలాంటి సినిమాను సమర్పిస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది’ అంటున్నారు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu