జూనియర్ ఎన్టీఆర్ కు ‘RRR’ దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. అందువల్ల ఆయన నుంచి నెక్ట్స్ వచ్చే ప్రాజెక్టుల కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వచ్చాయి. వర్కింగ్ టైటిల్స్గా ‘ఎన్టీఆర్ 30’ , ‘ఎన్టీఆర్ 31’ అని వ్యవహరిస్తున్నారు. తాజాగా ‘ఎన్టీఆర్ 30’ కి సంబంధించిన ఓ అప్డేట్ ఫిల్మ్నగర్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..
‘ఎన్టీఆర్ 30’ ని యువ సుధా ఆర్ట్స్ భారీ బడ్జెట్తో నిర్మించనుంది. పాన్ ఇండియాగా సినిమాగా రూపొందించనుంది. అందువల్ల విలన్ను ఇతర ఇండస్ట్రీల నుంచి తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్, బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తో చర్చలు జరుపుతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరు విలన్గా నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించనున్నారు. ఈ మూవీతోనే ఆమె టాలీవుడ్కు ఎంట్రీ ఇవ్వనున్నారు.