టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఊరిపేరు భైరవకోన’. థ్రిల్లర్ జానర్గా వస్తున్న ఈ సినిమాకి వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో టైగర్ సినిమా వచ్చింది. ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు ‘ఊరిపేరు భైరవకోన’ సినిమాతో సందీప్ కిషన్ హిట్ ట్రాక్ పడతాడు.. అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.. నిజమే నే చెబుతున్నా, హుమ్మా హుమ్మా సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికర అప్డేట్ ని మేకర్స్ ప్రటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుందంటూ మేకర్స్ నుంచి ప్రకటించారు.
హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ నిర్మించిన ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయన్గా నటిస్తుంది. రాజ్ తోట సినిమాటోగ్రఫి, చోటా కె ప్రసాద్ ఎడిటర్ లు గా వ్యవహరిస్తున్నారు.