HomeTelugu Trendingతనను చంపేస్తారని చాలా ఆందోళన చెందేవాడు: సిద్ధార్థ్

తనను చంపేస్తారని చాలా ఆందోళన చెందేవాడు: సిద్ధార్థ్

Sushant singh rajput deathసుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్ మొత్తాన్ని కుదిపేసింది. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. డ్రగ్స్ కోణం బయటకు రావడంతో సుశాంత్ ప్రేయసి రియాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలువురుని అధికారులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా సుశాంత్‌ స్నేహితుడు సిద్దార్థ్‌ పితానిని కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు ప్రశ్నించగా పలు కీలక విషయాలు వెల్లడించాడు. సుశాంత్‌ ఆత్మహాత్యకు ముందు పలు సంఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన అన్నాడు. సుశాంత్‌ మృతికి కొన్ని రోజుల ముందు ఆయన మాజీ మేనేజర్‌ దిశా ఆత్మహత్యకు పాల్పడడంతో సుశాంత్ చాలా భయపడ్డాడని సిద్ధార్థ్ తెలిపాడు.

తనను చంపేస్తారని సుశాంత్‌ పదే పదే తనకి చెప్పి ఆందోళన చెందేవాడని అన్నాడు. సుశాంత్ తన సెక్యూరిటీని కూడా పెంచుకోవాలనుకున్నాడని’ సీబీఐ విచారణలో సిద్దార్థ్ పితానీ చెప్పినట్లు జాతీయ మీడియా లో వార్తలు వస్తున్నాయి. అంతేగాక, మరిన్ని విషయాలను కూడా ఆయన సీబీఐ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. కాగా, సుశాంత్‌ సింగ్ ల్యాప్‌టాప్‌ తో పాటు హార్డ్‌డ్రైవ్‌ను ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి తీసుకువెళ్లిందని కూడా సిద్దార్థ్ వెల్లడించినట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu