HomeTelugu Trendingహిందీ ప‌రిశ్ర‌మలో క్రూర‌త్వం పెరిగిపోంది: సంజయ్ నిరుపమ్

హిందీ ప‌రిశ్ర‌మలో క్రూర‌త్వం పెరిగిపోంది: సంజయ్ నిరుపమ్

7 15
బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై బాలీవుడ్ లోని అంతర్గత వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. డైరెక్టర్ శేఖర్ కపూర్ ఆవేదనాభరితంగా ఓ ట్వీట్‌ చేశారు. నిన్ను దారుణంగా హింసించిన వారి గురించి నాకు బాగా తెలుసు అంటూ సుశాంత్ అన్నారు. ఈ ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది.

సుశాంత్ మరణంపై రాజకీయ నాయకుడు సంజయ్ నిరుపమ్ కూడా సంచలన ఆరోపణలు చేశారు. 2019 లో వచ్చిన ‘చిచోర్’ సినిమా హిట్‌ అయిన‌ప్ప‌టికీ కావాల‌నే 7 సినిమాల్లో సుశాంత్‌ని త‌ప్పించార‌ని ట్వీట్ చేశారు. సినిమా స‌క్సెస్ కాగానే ఏడు సినిమాల‌కి సుశాంత్ సైన్ చేయ‌గా, ఈ ఆరు నెల‌ల్లోనే ఆ చిత్రాల‌ను కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని దీనికి కార‌ణం ఎవ‌రు అంటూ ప్ర‌శ్నించారు. హిందీ ప‌రిశ్ర‌మ క్రూర‌త్వం మ‌రో స్థాయికి చేరింద‌ని, ఓ ప్ర‌తిభ గ‌ల నటుడిని బ‌లితీసుకుందంటూ ట్విటర్ వేదిక‌గా ధ్వ‌జ‌మెత్తారు.

ఇక కొంద‌రు ప్ర‌ముఖ‌లు సైతం బాలీవుడ్‌లో పేరుకుపోయిన నెపోటిజాన్ని బాహాటంగానే వెళ్ల‌గక్కుతున్నారు. కంగ‌నా, వివేక్ ఒబెరాయ్, ప్ర‌కాశ్ రాజ్..ఇలా పలువురు సుశాంత్ మ‌ర‌ణంతోనైనా మేల్కోవాల‌ని, ఇప్ప‌టికైనా వార‌స‌త్వాన్ని ప‌క్క‌న‌పెట్టి ప్ర‌తిభకు ప‌ట్టం క‌ట్టాలంటూ నిలదిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!