HomeTelugu Newsహీరోయిన్‌తో బైక్‌పై తెలంగాణ మంత్రి చక్కర్లు

హీరోయిన్‌తో బైక్‌పై తెలంగాణ మంత్రి చక్కర్లు

16 1

తెలుగు అమ్మాయి ఈషా రెబ్బాను ఓ తెలంగాణ మంత్రి బైక్‌పై ఎక్కించుకుని చక్కర్లు కొట్టాడు. అయితే అది సందేశం కోసమే. అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో టాలీవుడ్‌లో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అరవింద సమేత సినిమాతో త్రివిక్రమ్ హీరోయిన్ అయిపోయింది. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది ఈ బ్యూటీ. దానికి ముందు ఇంద్రగంటి మోహనకృష్ణ బందిపోటు.. అమీ తుమీ లాంటి సినిమాల్లో మెరిసింది కానీ సరైన బ్రేక్ అయితే రాలేదు.

తెలుగమ్మాయి కావడంతో బేసిగ్గానే ఈమెను పట్టించుకోలేదు మన దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే తాజాగా ఈమె తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో బైక్ ఎక్కి చక్కర్లు కొట్టింది. ఈ వీడియో, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే చెక్కర్లు కొడుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు పాటించాల్సిన భద్రతా నిబంధనల గురించి మంత్రి పువ్వాడ అందరికీ సూచించారు. ఇందులో భాగంగానే ఆయన ఓ రైడ్ కూడా చేసాడు.

రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలను జనవరి 28న నెక్లెస్‌ రోడ్డులోని హెచ్‌ఎండీఏ మైదానంలో ప్రారంభించారు. అక్కడికి హీరోయిన్ ఈషా రెబ్బా కూడా వచ్చింది. ఈ సందర్భంగానే మంత్రి పువ్వాడ హెల్మెట్‌ ధరించి బైక్ రైడ్ చేస్తుంటే వెనక సీట్‌లో కూర్చుంది ఈషా. ఈ ఇద్దరూ బైక్‌పై వెళ్తుండగా ఫోటోలు క్లిక్ అనిపించాయి. నిబంధనలను పాటించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు మంత్రి పువ్వాడ. ఇక ఈషా రెబ్బా కూడా నియమాలు పాటించాలంటూ వాహన దారులకు విజ్ఞప్తి చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu