HomeTelugu Newsవిషాదం: గాలిదుమారానికి ఎగిరిపోయి.. ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

విషాదం: గాలిదుమారానికి ఎగిరిపోయి.. ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

The child died due to heavy wind

మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేట జాజితండాలో విషాదం చోటు చేసుకున్నది. రాకాసి గాలిదుమారం సుడిగాలిలా విరుచుకుపడటంతో.. ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. జాజితండాకు చెందిన మంజుల, మాన్సింగ్‌ దంపతులకు సంగీత, సీత అనే కవలలు ఉన్నారు.

అదే తండాలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సంగీత (6) ఒకటో తరగతి చదువుతున్నది. సోమవారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. నానమ్మతో ఉన్న సంగీత, సీత ఇంట్లో రేకులకు ఉయ్యాల కట్టుకుని ఆడారు. కొద్దిసేపటికి నానమ్మ, సీత ఇద్దరూ పక్కింట్లోకి వెళ్లారు.

అప్పుడే రాకాసి గాలిదుమారం సుడిగాలిలా విరుచుకుపడింది. గద్ద వచ్చి కోడిపిల్లను ఎత్తుకుపోయినట్టు ఆ సుడిగాలి ఉయ్యాలలో ఉన్న చిన్నారి సంగీతను రేకులషెడ్డుతోసహా విసిరికొట్టింది. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు గాయాలతో కొట్టుమిట్టాడుతున్న సంగీతను 108లో నర్సాపూర్‌ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ మంగళవారం చిన్నారి సంగీత మరణించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని నర్సాపూర్‌ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu