తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. 2019 సెప్టెంబర్ 8న ఆమె తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు. సోమవారం ఉదయం తమిళిసై తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈమేరకు తెలంగాణ గవర్నర్ ఆఫీసు నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమిళిసై రాజీనామా సంచలనంగా మారింది. లోక్ సభ ఎన్నికల బరిలో తమిళిసై నిలబడతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, అలాంటిదేమీ లేదని గతంలో స్పష్టం చేసిన తమిళిసై.. ప్రస్తుతం తన పదవికి రాజీనామా చేయడంతో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది.
తమిళనాడు నుంచి తమిళిసై లోక్ సభ బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. తమిళిసై నాడార్ సామాజిక వర్గానికి చెందిన లీడర్.. దీంతో నాడార్ ల ప్రభావం ఎక్కువగా ఉన్న చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారి నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి తమిళిసై పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.