HomeTelugu Newsజబర్దస్త్‌ టీమ్‌కు దసరా కానుక ఇచ్చిన రోజా

జబర్దస్త్‌ టీమ్‌కు దసరా కానుక ఇచ్చిన రోజా

8 9తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమైన షో ‘జబర్దస్త్‌’. అయితే దసరా సందర్భంగా జరిగిన జబర్దస్త్‌ షూటింగ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా.. జబర్దస్త్‌ నటులకు ‘శ్రీ పూర్ణిమ’ భక్తి గ్రంథాన్ని దసరా కానుకగా అందజేశారు. ఈ బుక్‌ అందుకున్న వారిలో అప్పారావు, రాకేశ్‌, సుధాకార్‌, ఆది, రాఘవ, చంటి, రాజు తదితరులు ఉన్నారు. ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌ రచించిన ఈ గ్రంథానికి రోజా ప్రచురణకర్తగా వ్యవహరించారు.

అయితే శ్రీనివాస్‌ గతంలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో అత్యంత కీలక పదవి చేపట్టారు. శ్రీశైలం క్షేత్రానికి కూడా ప్రత్యేక సలహాదారుడిగా వ్యవహరించారు. రోజా సమర్పించిన ఈ గ్రంథంలో శ్రీనివాస్‌.. తనకు ఆత్మ బంధువులైన వారాహి చలనచిత్ర అధినేతలు సాయి కొర్రపాటి, రజని కొర్రపాటి దంపతుల పేర్లను కృతజ్ఞతాపూర్వకంగా ప్రకటించారు. ఈ గ్రంథానికి విశేష స్పందన లభిస్తోంది. తిరుమల, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, అహోబిలం, యాదాద్రి మొదలుకొని.. పలు మహా శైవ వైష్ణవ ఆలయాల అర్చకులకు, వేద పండితులకు, వేదపాఠశాలలకు రోజా స్వయంగా ఈ గ్రంథాన్ని సమర్పించారు. దీంతో వారు రోజాను ప్రశంసించారు. తాజాగా దసరా సందర్భాన్ని పురస్కరించుకుని జబర్దస్త్ టీం అందరికీ రోజా ‘శ్రీ పూర్ణిమ’ గ్రంథాన్ని అందించడంతో జబర్దస్త్‌ నటులు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. దీనికి రోజా.. అమ్మవారి అనుగ్రహంతో ఈ బుక్ ఇస్తున్నానని, ఖాళీ సమయాల్లో ప్రార్థనకై ఇది చాలా ఉపయోగపడుతుందని వారికి బదులిచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu