టాలీవుడ్ స్టైలిష్ స్టార్.. అల్లు అర్జున్ తాజా చిత్రంగా రూపొందిన ‘అల వైకుంఠపురములో’. సంక్రాతి కానుకగా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, విడుదలైన అన్ని ప్రాంతాల్లోను విజయవిహారం చేస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది.
ఇంతకు ముందే ఆమె అల్లు అర్జున్ జోడీగా ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో నటించింది. ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఈ జోడీకి రెండో హిట్ లభించింది. ఈ నేపథ్యంలో ‘పూజా హెగ్డే’తో మరోసారి కలిసి నటించాలని వుంది’ అంటూ తన మనసులోని మాటను అల్లు అర్జున్ బయటపెట్టాడు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ మాట అన్నాడు. దాంతో ఆయన తదుపరి సినిమాలోను పూజా హెగ్డేకి ఛాన్స్ లభించవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.